ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మృతిపై బీఎస్సీ అధినేత్ర మాయావతి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన మానవ మృగాలను ఉరితీయాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని మండిపడ్డారు. చట్టం వల్ల భయం పెరిగెలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితురాలి కుటుంబానికి బీఎస్పీ అండగా ఉంటుందని అన్నారు.