సంచలనం సృష్టించిన హాజీపూర్ ఘటనలో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలంటూ బాధితుల బందువులు డిమాండ్ చేశారు.. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్స్టేషన్ ముందు స్థానికులతో కలిసి బాధితుల బందువులు ఆందోళనకు దిగారు.
దాదాపు ఏడాది కావస్తున్నా ఇంతవరకు నిందితుడికి శిక్షపడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. హైదరాబాద్ దిశ హత్య కేసులో హంతకులను ఎన్ కౌంటర్ చేసిన మాదిరిగానే హాజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులు, మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.