Property Issue : ఆస్తి కోసం తండ్రిపై దాడి... కుర్చీలోనే వృద్ధుడు మృతి

Update: 2024-04-29 08:01 GMT

ఆస్తికోసం జరుగుతున్న గొడవలు బంధాలకు విలువ లేకుండా చేస్తున్నాయి. కన్న కొడుకు ఆస్తులు పంచాలంటూ తండ్రిపై అమానుషంగా దాడి చేశాడు. వృద్ధుడు అని కూడా చూడకుండా పిడిగుద్దులు గుద్ది.. కాలుతో తన్నాడు. కొడుకు దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ తండ్రి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

ఎ.కులందైవేల వయసు 63 ఏళ్లు. శ్రీ అమృత సాగో ఇండస్ట్రీస్‌ను నిర్వహిస్తున్నాడు. అతని వ్యాపార బాధ్యతలను పంచివ్వాలంటూ కొడుకు సంతోష్‌ గొడవ పెట్టుకున్నాడు. కానీ.. కొడుకు వ్యవహారం నచ్చక కులందైవేల ఆస్తులు పంచలేదు. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మరోసారి తండ్రితో గొడవపడ్డాడు. విచక్షణ కోల్పోయిన సంతోష్‌ కన్న తండ్రిపై దాడికి తెగబడ్డాడు. సోఫాలో కూర్చుని ఉన్న తండ్రిపై పిడిగుద్దులు కురిపించాడు. ముఖంపై బలంగా పలుమార్లు దాడి చేశాడు. రెండు అడుగులు వెనక్కి వేసి.. మరోసారి తిరిగి వెళ్లి కాలుతో ఛాతిపై గట్టిగా తన్నాడు. కొడుకు చేసిన దాడిలో తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు, స్థానికులు అరుపులు విని పరుగెత్తుకువచ్చి అతడిని ఆపారు.

తీవ్ర గాయాలపాలై స్పృహ కోల్పోయిన తండ్రిని కుటుంబ సభ్యులు, స్థానికులు హాస్పిటల్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ కులందైవేల ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు తండ్రిపై దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కసాయి కొడుకును జైల్లో పెట్టారు పోలీసులు.

Tags:    

Similar News