మీకు బ్యాంక్లో అకౌంట్ ఉంటే వెంటనే ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోండి. లేకపోతే పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడవు. రైతులకు ఆర్ధిక సహాయం చేయాలనే యోచనతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతులకు ఏడాదికి రూ.6,000 అందిస్తుంది. అయితే ఈ డబ్బులు 3 విడతలుగా రూ.2,000ల చొప్పున అందిస్తుంది. అకౌంట్ను ఆధార్తో లింక్ చేసుకోకపోతే అకౌంట్లోకి డబ్బులు రావని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు.