వయనాడ్ ర్యాలీలో రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలు లోక్సభలో తీవ్ర దుమారాన్ని రేపాయి. మేక్ ఇన్ ఇండియా కాదు.. రేప్ ఇన్ ఇండియా అంటూ.. రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని మహిళా ఎంపీలు తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్గాంధీ క్షమాపణలు చెప్పాలని మహిళా ఎంపీలు పట్టుబట్టారు. రాహుల్ దేశాన్ని అవమానిస్తున్నారని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.