ప్రేమించానన్నాడు.. వంచించి అక్రమంగా కాపురం కూడా పెట్టాడు. కానీ చివరికి నమ్మినోడే ఆమె పాలిట యుముడిగా మారాడు. దారుణంగా హత్య చేశాడు. మహిళలపై ఆఘాయిత్యాలను అరికట్టడానికి ఎన్ని కఠిన చట్టాలు చేస్తున్నా.. మరోవైపు వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. విశాఖలో ఇలాంటి దారుణ ఘటనే చోటు చేసుకుంది. విశాఖలోని హుకుంపేట మండలం ఒంటిపాకకు చెందిన గిరిజన యువతి కనకరత్నం.. ప్రసాద్ అనే యువకుడితో ప్రేమలో పడింది. పాడేరులో ల్యాబ్ టెక్నిషియన్గా పనిచేస్తున్న ప్రసాద్కు గతంలో పెళ్లి జరిగినట్టు తెస్తుంది. అయినా.. ప్రేమ పేరుతో కనకరత్నంను మోసం చేశాడు. పాడేరులో కొంతకాలంగా రహస్యంగా కాపురం కూడా పెట్టాడు. ఐతే వీరి మధ్య కొత్త వాగ్వాదం చోటు చేసుకోవడంతో.. కనకరత్నంను హత్య చేశాడని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే ప్రసాద్పై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.