పాకిస్తాన్లోని లాహోర్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దేశద్రోహం కేసులో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు మరణ శిక్ష విధించింది. 2007 నవంబర్ 3న పాక్లో ఎమర్జెన్సీ విధించడంతో.. 2013లో ముషారఫ్పై దేశద్రోహం కేసు నమోదైంది. దీంతో విచారణచేపట్టిన న్యాయస్థానం.. ముషారఫ్ దేశద్రోహం కేసులో దోషిగా తేల్చింది.