తెలంగాణలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై దృష్టిసారించామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. జగిత్యాల జిల్లా రాజేశ్వరరావు పేట శివారులోని రివర్స్ పంపుహౌజ్ను కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావుతో కలిసి పరిశీలించారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాను సాగులోకి తేవడంపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారని అన్నారు మంత్రి. రాజేశ్వరరావు పేటపంపుహౌజ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు.