ఏపీలో పరిపాలన వికేంద్రీకరణపై పొలిటికల్ దుమారం కొనసాగుతోంది. జిఎన్.రావు కమిటీ నివేదికపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. విశాఖలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరగడంతోనే వైసీపీ ఆ నిర్ణయం తీసుకుందని టీడీపీ విమర్శిస్తోంది. కేవలం చంద్రబాబుపై రాజకీయ కక్షతోనే జగన్ అమరావతి నుంచి రాజధానిని మారుస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.