ఆదిలాబాద్ జిల్లా సమత కేసు విచారణలో భాగంగా.. సోమవారం ఫాస్ట్ ట్రాక్ కోర్డుకు సాక్షులు హాజరయ్యారు. ఏడుగురు సాక్షులతో పాటు సమత కుటుంబ సభ్యులు కోర్టుకు వచ్చారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను కూడా.. కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. గత నెల 24న సమతను దారుణంగా హత్యచేసిన ఈ ఘటనలో.. సోమవారం నుంచి 44 మంది సాక్షులను కోర్టు విచారించనుంది. ఈ నెలాఖరు వరకు సాక్షుల విచారణ పూర్తి చేయనున్నారు.