ఏపీ ప్రభుత్వం తీరుపై క్యాట్ సీరియస్ అయ్యింది. పది రోజుల కిందట ఏపీఈడీబీ సీఈఓ కృష్ణ కిషోర్ను జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో కృష్ణ కిశోర్ క్యాట్ను ఆశ్రయించారు. వారం కిందటే స్టే ఇచ్చిన క్యాట్.. ఇవాళ విచారణ చేపట్టింది.
ఐఎర్.ఎస్ అధికారి కృష్ణ కిషోర్ను ఎందుకు ఇప్పటి వరకు రిలీవ్ చేయలేదని జగన్ సర్కార్ను క్యాట్ ప్రశ్నించింది. కేంద్రం ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోరాటా.. వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని క్యాట్ ఆదేశించింది.