గతంలో అమరావతికి మద్దతు తెలిపిన జగన్.. అధికారంలోకి రాగానే మాట తప్పి..మడమ తిప్పారని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలన్నదే జగన్ ఎత్తుగడని ఆరోపించారు.రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రాజధాని రైతుల ఆందోళనకు మద్దతుగా మంగళగిరిలో నిర్వహించిన కాగడాల ర్యాలీలో లోకేష్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న రైతులు, రైతు కూలీలు, ప్రజాసంఘాల నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.