ఆర్ఎస్ఎస్ విజయ్ సంకల్ప్ వేడుకలకు భాగ్యనగరం సిద్దమైంది. రెండు దశాబ్దాల అనంతరం జరుగుతున్న అతి పెద్ద కార్యక్రమానికి.. ఏర్పాట్లు పూర్తి చేశారు. 8వేల మంది స్వయం సేవకులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలంగాణపై పట్టు సాధించాలని భావిస్తున్న ఆర్ఎస్ఎస్.. ఇదే వేదికగా కమల నాథులకు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.