ప్రజాభిప్రాయం మేరకే రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని GN రావు కమిటీ నివేదికలో పేర్కొందని.. స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వైఎస్ జగన్కు అధికారం కట్టబెట్టారని.. ప్రజలు కోరుకున్న విధంగానే పాలన వికేంద్రీకరణ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తమ్మినేని అన్నారు.