తెలంగాణ సీఎం కేసీఆర్తో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ సమావేశమైంది. కేంద్రం తీసుకువచ్చిన సీఏఏపై చర్చించారు. NRC, NPA , CAA అమలు చేయొద్దని కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. కేంద్ర తీసుకువచ్చిన ఈ చట్టాలతో మైనార్టీల మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తుందని మైనార్టీ నేతలు విమర్శించారు.