ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. బుజ్జి కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు.. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొన్నారు చంద్రబాబు. నారా లోకేష్, మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, చినరాజప్ప, పత్తిపాటి పుల్లారావు, జవహర్, ఇతర ఎమ్మెల్యేలు బుజ్జికి ఘన నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బడేటి బుజ్జి మరణం టీడీపీకి తీరని లోటన్నారు చంద్రబాబు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.