ఎంతో ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ ఈ సోమవారం పూర్తైంది. మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఉద్దవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. వీరితో పాటు ఎన్సీపీ, కాంగ్రెస్కు చెందిన సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు.