మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడేనంటున్నారు విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా వున్న నల్గొండ జిల్లాను సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రస్తుతం నల్గొండ జిల్లా గులాబీ ఖిల్లాగా మారిందంన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.