అమరావతి రైతుల ఉద్యమం కోసం రెండు బంగారు గాజులను తీసి ఇచ్చిన నారా భువనేశ్వరి

Update: 2020-01-01 08:50 GMT

అమరావతి రైతుల ఉద్యమ కోసం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన రెండు బంగారు గాజులను తీసి ఇచ్చారు. ఎర్రబాలంలో రైతుల దీక్షలో చంద్రబాబుతో పాటు పాల్గొన్న భువనేశ్వరి అప్పటికప్పుడు తన గాజులను ఇచ్చేశారు. కొత్త సంవత్సరం వేడుకల కోసం చేసే ఖర్చును.. అమరావతి రైతుల ఉద్యమం కోసం విరాళంగా ఇవ్వాలన్న చంద్రబాబు పిలుపు మేరకు.. పలువురు విరాళాలు ఇచ్చారు. చంద్రబాబు విరాళాలు ఇచ్చినవారి పేర్లు చదువుతుండగా.. భువనేశ్వరి తన గాజులను తీసి.. చంద్రబాబుకు ఇచ్చారు. దీంతో ఎర్రబాలెంలో హర్షాతిరేకాలు మిన్నంటాయి.

Similar News