వారి ఆశీర్వాదంతోనే తెలంగాణాలో బీజేపీ బలపడుతుంది : ఎంపీ ధర్మపురి

Update: 2020-01-02 15:32 GMT

ఎన్నారైల ఆశీర్వాదంతోనే తెలంగాణాలో బీజేపీ బలపడుతుందన్నారు నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్. దుబాయ్ సోనాపూర్ లోని బ్లూ డైమండ్ వర్కర్స్ క్యాంపు లో జరిగిన నూతన సంవత్సర వేడుకలకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ప్రవాస భారతీయులతో కలిసి న్యూఇయర్ వేడుకలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నారైలు గర్వపడేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలన కొనసాగుతుందన్నారు ఎంపి అరవింద్.

Similar News