ఏపీ రాజధానిపై సీఎం జగన్ తీరును నిరసిస్తూ విజయవాడలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆంధ్రరత్న భవన్ వద్ద ధర్నా చేపట్టింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా జీఎన్రావు కమిటీ రిపోర్ట్, హైపర్ కమిటీ జీవో ప్రతులను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా.. ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా జగన్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.