భాగ్యనగరంలో క్రికెటర్ రోహిత్ శర్మ దంపతులు సందడి చేశారు .హైదరాబాద్ నగరశివారు చెవూర్ గ్రామంలోని హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్లో క్రికెట్ స్టేడియంకు రోహిత్ శర్మ శంకుస్థాపన చేశారు. ధ్యాన కేంద్రంలో విద్యార్థుల మనోవికాసానికి యోగ,మెడిటేషన్ తో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు క్రికెట్ స్టేడియంను నిర్మిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు .ధ్యాన కేంద్రంలోని విద్యార్థులతో రోహిత్ శర్మ సరదాగా గడిపారు.