పోలీసులు అర్థరాత్రి గోడలు దూకి ఇళ్లలోకి వస్తున్నారు: మహిళలు

Update: 2020-01-04 10:13 GMT

అమరావతి రాజధాని గ్రామాల్లో పోలీసుల అలజడి రేగుతోంది. అర్ధరాత్రి, అపరాత్రి వచ్చి తలుపులు తడుతున్నారని.. గోడలు దూకి ఇళ్లలోకి వస్తున్నారని మహిళలు వాపోతున్నారు. వాళ్లకు ఆ హక్కు ఎవరిచ్చారని నిలదీస్తున్నారు. ఎవరైనా తప్పు చేసి ఉంటే.. వాళ్ల వివరాలు ఇస్తే.. తామే పట్టిస్తామని అంటున్నారు. తెల్లవారుజామున తమ గ్రామాల్లో తిరుగుతున్న పోలీసులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని వాళ్లు రిలీజ్‌ చేశారు. భయపెట్టి తమ ఉద్యమాన్ని అణిచివేయలేరని మహిళలు అంటున్నారు.

Similar News