సీనియర్ రాజకీయ నాయకుడైన బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దాంతో తన స్నేహితుడైన బొజ్జల ని సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని బొజ్జల ఇంటికి కేసీఆర్ వెళ్లి ఆయన యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా బొజ్జల కుటుంబసభ్యులను కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. అనంతరం సీఎం కేసీఆర్ ను బొజ్జల శాలువాతో సన్మానించారు. అందరూ కలిసి గ్రూపు ఫోటో దిగారు.