Face Tips : ముఖం కాంతివంతంగా .. వంటింటి ఫేస్‌ప్యాక్స్‌

Update: 2024-04-27 06:26 GMT

వంటింట్లో వాడే ఆహార పదార్థాలతోనే అద్భుతమైన ఫేస్‌మాస్క్‌లు తయారు చేసుకోవచ్చు. అవే ఇవి..

* బొప్పాయి పండు అంటే ఎవరికైనా ఇష్టమే. అయితే తీపి బొప్పాయితో చక్కని ఫేస్‌మాస్క్‌ చేసుకోవచ్చు. రెండు టేబుల్‌ స్పూన్ల గుజ్జును ముఖానికి మర్దనలా చేసుకోవాలి. దీనివల్ల చర్మంలో మృతకణాలు తొలగిపోతాయి.

* గుమ్మడికాయల గుజ్జుతో ఫేస్‌ప్యాక్‌ వేసుకుని కరిగిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీనివల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

* చిటికెడు పసుపు, టేబుల్‌ స్పూన్‌ ఆపిల్‌ సిడార్‌, టీస్పూన్‌ తేనెను సమపాళ్లలో కలపాలి. బౌల్‌లో బాగా కలిపిన తర్వాత మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకుంటే చర్మ వ్యాధులు తొలగిపోతాయి. యాంటీబయాటిక్‌ మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది.

* కీరాదోసకాయను మిశ్రమంగా చేసి.. మాస్క్‌ వేసుకుంటే పొడిగా ఉండే చర్మం స్మూత్‌గా తయారవుతుంది.

* బౌల్‌లో టీస్పూన్‌ అవకాడో చూర్ణం, అదే సమపాళ్లలో అరటిపండు గుజ్జు తీసకోవాలి. బాగా మిక్స్‌చేశాక పట్టించాలి. మాస్క్‌ ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే ముఖంలో మెరుపుదనం వస్తుంది.

* టేబుల్‌ స్పూన్‌ టమోటో గుజ్జు, టేబుల్‌ స్పూన్‌ పెరుగు, టీస్పూన్‌ తేనెను తగుపాళ్లలో తీసుకుని చూర్ణంగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తరచుగా ముఖానికి పట్టిస్తుంటే చర్మంలో ఉండే నూనెశాతం తగ్గిపోవటమే కాకుండా చర్మంలో స్పార్క్‌ కనపడుతుంది.

* టేబుల్‌ స్పూన్‌ ఆరెంజ్‌ రసం, టేబుల్‌ స్పూన్‌ పాలను తగిన నిష్పత్తిలో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. ఆరిన తర్వాత కడిగేస్తే ఫ్రెష్‌గా అనిపిస్తుంది. దీంతో పాటు సన్‌టాన్‌ ఉండదు.

* టీస్పూన్‌ నిమ్మరసం, టేబుల్‌ స్పూన్‌ ఎగ్‌వైట్‌ మిశ్రమం కలిపి ముఖానికి పట్టించాలి. దీనివల్ల నల్లటి మచ్చలు తొలగిపోతాయి.

Tags:    

Similar News