నగరి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తనకు వెన్నుపోటు పొడిచిన వారిని గత నాలుగు నెలలుగా పక్కన పెట్టామన్నారు ఎమ్మెల్యే రోజా. తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న ఆమె.. ఆదివారం తనపై జరిగిన దాడిపై వివరణ ఇచ్చారు. పార్టీ పరంగా పక్కన పెట్టిన వారే ఇప్పుడు వైసీపీ ముసుగులో తనపై దాడికి ప్రయత్నించారన్నారు. లా అండ్ ఆర్డర్కు విఘాతం కల్గించే వారిపై జగన్ కఠినంగా వ్యవహరిస్తారన్నారు రోజా.