అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నారన్న ఆవేదనతో.. మరో రైతు బలయ్యాడు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన రైతుల సంఖ్య ఐదుకు చేరింది. అమరావతి ప్రాంతంలోని పొన్నెకల్లు గ్రామ వాసి అయిన రామాయణపు రామాయణపు లక్ష్మయ్య.. మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. రాజధాని తరలింపు వార్తలతో తీవ్ర వేధనకు గురైన లక్ష్మయ్య అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. చికిత్స తీసుకుంటూ చనిపోయాడు.