సీఎం జగన్‌కు అమరావతి రైతుల నిరసన సెగ

Update: 2020-01-07 07:33 GMT

ముఖ్యమంత్రి జగన్‌కు రాజధాని రైతుల నిరసన సెగ తగలింది. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ సచివాలయానికి వెళ్లే సమయంలో మందడం మహిళలు నిరసన తెలియజేశారు. గ్రామంలో ఇళ్ల నుంచే ప్లకార్డులు పట్టుకుని మహిళలు నిరసన తెలిపారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధాని తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారంతా డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News