ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం.. కార్మికుడు సజీవదహనం

Update: 2020-01-09 03:29 GMT

ఢిల్లీని వరుస అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. వారం రోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే మరో అగ్నిప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని పట్పర్‌గంజ్‌ పారిశ్రామికవాడలోని ఓ పేపర్ ప్రింటింగ్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అగ్నికీలలకు ఒక కార్మికుడు సజీవదహనం అయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 35 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు పోలీసులు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News