రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను పోలీసులు వేధించడం దారుణమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే పోలీసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ముందస్తు అరెస్ట్ల పేరుతో మానసికంగా, శారీరకంగా బాధపెడుతున్నారని అన్నారు. తనను కలిసిన రాజధాని రైతులకు జనసేన అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు.