సూర్యాపేట జిల్లా చివ్వెంల పోలీస్ స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. పీఎస్లో బావపై బ్లేడ్తో దాడి చేశాడు బావమరిది. దేవేందర్ పరిస్థితి విషమంగా మారడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. భార్యా భర్తల మధ్య గతకొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బావపై బావమరిది దాడి చేశాడు.