రాజధాని మార్చే అధికారం సీఎంకు ఎవరిచ్చారని నిలదీశారు చంద్రబాబు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానులు మారుస్తామంటే ఎలా అని నిలదీశారు. అమరావతి ముంపు ప్రాంతం, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఇక్కడ హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ సహా అన్ని సౌకర్యాలు కల్పించాలమని అన్నారు. తాను కట్టిన ఏసీ రూముల్లో ఉంటూ.. అసలు నిర్మాణాలే జరగలేదని వైసీపీ నేతలు అంటున్నారని మండిపడ్డారు.