దేశం బాగుండాలంటే ఎర్రకోటపై .. రామగుండం బాగుండాలంటే కార్పొరేషన్పై కాషాయం జెండా ఎగరాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. టీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. కమిషన్ల కోసమే సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. రామగుండం అభివృధ్ధికి కేంద్రం వంద కోట్ల నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ.. పనులు ప్రగతి భవన్ దాటడం లేదని విమర్శించారు.