రాజధాని అమరావతి ప్రాంత మహిళలు గవర్నర్ను కలిసారు. తాము శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు తెలుపుతుంటే.. పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అక్రమ అరెస్టులు, దాడుల అంశాల్ని బిశ్వభూషణ్కు వివరించారు. ఈ వ్యవహారంలో రాజ్భవన్ జోక్యం చేసుకోవాలని.. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరారు.