ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై హై పవర్ కమిటీ సిఫార్సు లను క్యాబినెట్ ఆమోదించింది. గంటపాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 7 కీలక బిల్లులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రైతు భరోసా కేంద్రాలకు ఆమోదం లభించింది. అంతేకాదు పలు కీలక అంశాలపై కూడా చర్చ జరిపింది.