పేదలకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యం - సీఎం జగన్‌

Update: 2020-01-21 20:57 GMT

పేదలకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యమని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో అమ్మ ఒడి పథకంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 82 లక్షల మంది భవిష్యత్తును మార్చే పథకమని అన్నారాయన. మధ్యాహ్న భోజనంలోను మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. ఆ పథకం పనితీరు పర్యవేక్షణకు నాలుగు అంచెల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. జూన్ 1న ప్రతి విద్యార్థికి కిట్‌ అందజేస్తామని.. ఆ పథకం పేరు విద్యా కానుకగా జగన్ చెప్పారు.

 

Similar News