రంగారెడ్డి జిల్లా MVSR మున్సిపల్ సిబ్బంది తీరుపై వివాదం చెలరేగింది. అభ్యర్థులు రాకముందే రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులు బయటకు వచ్చాయి. దీంతో వివిధ పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు కౌంటింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తాము రాకముందే ఎలా బాక్సులు బయటకు తీస్తారని సిబ్బందిని నిలదీశారు. అధికార పార్టీకి అనుకూలంగా సిబ్బంది వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.