రాష్ట్రంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. మనల్ని చూసి ఇతర రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో అన్ని ప్రాంతాల్లో అలజడులు సృష్టిస్తున్నారని.. చిన్న చిన్న పట్టణాల్లోనూ శాంతియుత పరిస్థితులు కనిపించడం లేదన్నారు. మండలిలో సభ్యులు నిర్ణయం తీసుకుంటే అదేదో నేరమైనట్టే రద్దు చేయడం ఏంటని రామకృష్ణ మండిపడ్డారు.