తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. తన దగ్గరు చదువతున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్చించాడు. రాజోలు మండలం బి. సావరం మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్థానికులు.. హెడ్ మాస్టర్ కె. సుబ్రమణ్యంపై మండిపడుతున్నారు. పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థతిని నియంత్రించారు.