అమరావతి అంశాన్ని లోక్సభలో ప్రస్తావించారు గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న రాజధాని తరలింపు నిర్ణయంతో అక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. రైతుల ఆందోళనకు మద్దతు ఇవ్వడానికి వెళ్తే లాఠీఛార్జ్ చేస్తారా అంటూ ప్రశ్నించారాయన. ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో.. ఎస్పీల ఆధ్వర్యంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, హక్కులు హరించారని గల్లా జయ్దేవ్ పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చారు.