రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డి మార్ట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిలో తల్లి, కూతురు పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రికి తలించారు. డి మార్ట్లో షాపింగ్ చేసి ఆటో కోసం ఎదురుచూస్తున్న తల్లి, కూతురును అతివేగంతో వచ్చిన కారు వారిని ఢీ కొంది. దీంతో వారికి తీవ్ర గాయలు అయ్యాయి. కారులో మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారికి బ్రీత్ ఎనలైజర్లో చెక్ చేయగా 198 రిడింగ్ గా నమోదు అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.