అమరావతి ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొంతమంది రైతులను వెంటబెట్టుకుని వెళ్లి జగన్ను కలవడం చర్చనీయాంశమైంది.. ఎమ్మెల్యే ఆర్కేతోపాటు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి రైతులను వెంటబెట్టుకుని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్లారు. క్యాంప్ ఆఫీస్లో సీఎం జగన్ను కలిశారు. రాజధాని తరలింపుపై తమ సమస్యలను సీఎంకు వివరించారు.