శ్రీశైల మహాక్షేత్రంలో మరో భారీ కుంభకోణం వెలుగుచూసింది. పెట్రోల్ బంక్లో జరిగిన 43 లక్షల స్కామ్ మరువక ముందే మరో కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవస్థానం అభివృద్ధికి భక్తులు విరాళంగా సమర్పించే డబ్బును కొందరు ఉద్యోగులు కాజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 14 లక్షల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.