హైదరాబాద్లో ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది. రాజధాని, భవిష్యత్ కార్యాచరణపైనే ప్రధానంగా చర్చించనున్నారు. ఈ మీటింగ్కి సతీష్జీ, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా, పురంధేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్ సహా ముఖ్యనేతలు హాజరయ్యారు. రాజధాని వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని ఇప్పటికే కేంద్రం పార్లమెంట్ వేదికగానే ప్రకటన చేసిన నేపథ్యంలో.. అమరావతిపై ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలనే దానిపై చర్చించనున్నారు.