ప్రభుత్వం ఇచ్చే పించన్లే వారికి ఆధారం. అది కాస్తా రద్దు కావడంతో వారి ఆవేదన వర్ణానాతీతం. విద్యుత్ వాడకం పెరిగిందని కొందరికి, లేని సొంతింటిని చూపించి మరికొందరికి తప్పుడు సర్వేలతో వారిని అనర్హులుగా ముద్రవేసింది ప్రభుత్వం. దీంతో విశాఖలో ఏడువేల మందికి పించన్ రద్దు చేశారు. ఒక్క దక్షిణ నియోజకవర్గంలనే దాదాపు 4 వేల మందికి పించన్.. ఈ నెల నుంచి రద్దు కావడంతో.. వారంతా.. జీవీఎమ్సీ కమిషనర్కు మొరపెట్టుకునేందుకు వచ్చారు.