హైదరాబాద్‌లో పేలుడు కలకలం

Update: 2020-02-08 15:34 GMT

హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో పేలుడు కలకలం రేపింది. ఓ చెత్త కుప్పలో నాగయ్య అనే వ్యక్తి చెత్త ఏరుతుండగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. పేలుడు ధాటికి స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పరిశీలించారు.

Similar News