భూపాలపల్లి జిల్లాలో ముంచెత్తిన అకాల వర్షాలు

Update: 2020-02-09 15:24 GMT

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోను అకాల వర్షాలు ముంచెత్తాయి. మహాదేవపూర్‌, మహముత్తారం, కాటారం, మాలహార్‌, పలిమేల మండలాల్లో గత రాత్రి నుండి వర్షం కురుస్తోంది. చేతికొచ్చిన పత్తి, మిర్చి పంటలకు భారీ నష్టం వాటిళ్లింది. దీంతో రైతులు ఆందోళనలు చెందుతున్నారు.

ఒక్కరోజు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ బురదమయమయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంట చేతికి వచ్చింది అనుకున్న సమయంలో ఈ వర్షం అపార నష్టాన్ని కలిగించింది.

Similar News