అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ... రైతుల చేస్తున్న ఉద్యమం జోరుగా కొనసాగుతోంది. అమరావతి పరిసర గ్రామాల్లోని రైతులు, యువకులు, మహిళలు, వృద్ధులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఉద్యమంలో అరెస్టైన యువకులను.. పోలీసులు నందిగామ సబ్ జైల్లో పెట్టారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వారిని పరామర్శించడానికి నందిగామ వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సబ్జైల్ వద్దకు తరలివచ్చారు.