ఎమ్మెల్యేల మధ్య విభేదాలతో ప్రజలకు ఉపయోగపడే పనులు నిలిచిపోతున్నాయన్నారు పవన్ కల్యాణ్. కర్నూలులో జోహారాపురం బ్రిడ్ను పరిశీలించారాయన. ప్రజలకు ఇబ్బందులు కలిగించేవారిపై తిరగబడాలన్నారు. వర్షం కురిసిప్పుడల్లా హంద్రీనదిపై మట్టి వంతెన తెగిపోతోందని, ఈ బ్రిడ్జ్ను ప్రభుత్వం పూర్తిచేయలేకపోతుందన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం సొంత అజెండాతో ముందుకెళ్తోందని విమర్శించారు పవన్. పాత ఇళ్లు పూర్తి చేయకుండా.. కొత్త ఇళ్ల పట్టాల పంపిణీతో ప్రజలు నష్టపోతారన్నారు.