మిస్టరీగా బాలుడి కిడ్నాప్.. తండ్రి ప్రియురాలిపై అనుమానం.. కానీ..

Update: 2020-02-13 18:03 GMT

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బాలుడి మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఈనెల 4న పెదకర అగ్రహారంలో.. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడు.. నందు కనిపించకుండాపోయాడు. బాలుడి కోసం మచిలీపట్నం మొత్తం జల్లెడ పట్టినా లాభం లేకుండాపోయింది. దీంతో బాలుడిని కిడ్నాప్ చేసుంటారనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలావుంటే, బాలుడి తండ్రి ప్రియురాలిపై.. బాలుడి తల్లి అనుమానం వ్యక్తం చేశారు. అయితే, సదరు యువతిని విచారించినా బాలుడి ఆచూకీ దొరకలేదు. దీంతో 9 రోజులుగా బాలుడి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది.

Similar News